వచ్చే రెండు నెలల్లో జరగనున్న ఐపిఎల్ 14 వ సీజన్ మ్యాచులన్నీ ముంబైలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ఏడాది ఐపిఎల్ భారత్లోనే జరగనుంది. విదేశీ క్రికెట్ జట్లు ప్రస్తుతం భారత్కు రావడానికి ఎలాంటి అడ్డూ చెప్పవు. కాబట్టి లీగ్ మొత్తాన్ని ఒకే స్టేడియంలో నిర్వహించవచ్చు. నాకౌట్ మ్యాచ్లకు వేరొక స్టేడియానికి మార్చవచ్చు. ఇప్పటి వరకూ మాకున్న సమాచారం ఇంతే. రేసులో ముంబై, అహ్మదాబాద్లు ముందున్నాయి అని పార్థ్ వెల్లడించారు.