ఐపిఎల్లో చివరి అంకం నేడు ప్రారంభం కానుంది. గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య నేడు తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్ల మధ్య ఈరోజు జరిగే మ్యాచ్లో విజేత నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్ 2 తో మరో అవకాశం దక్కనుంది. రాజస్థాన్ జట్టులో జాస్ బట్లర్, సంజూ శామ్సన్, పడిక్కల్, బోల్ట్, చాహల్, అశ్విన్లు టాప్ ప్లేయర్లు కాగా.. గుజరాత్లో పాండ్య, గిల్, రషీద్ ఖాన్లు ఉన్నారు.