ఐపిఎల్ 15వ సీజన్లో ఫైనల్కు చేరే 2వ జట్టు నేడు ఖరారు కానుంది. ఇప్పటికే క్వాలిఫయిర్ 1లో ఓడిన రాజస్థాన్, ఎలిమినేటర్లో గెలిచిన బెంగళూరులు ఈ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ స్టేడియానికి చేరుకున్నాయి. నేటి సాయంత్రం 7.30 నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఆదివారం రాజస్థాన్ లేదా బెంగళూరులు ఇప్పటికే ఫైనల్ చేసిన గుజరాత్ టైటాన్స్తో తలపడనున్నాయి.