అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు.బుష్ను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న ఐఎస్ తీవ్రవాదిని ఎఫ్బిఐ అరెస్ట్ చేసింది. ఈ లక్ష్యంతోనే రెండేళ్ళ క్రితమే అమెరికా వచ్చిన ఇరాకీయుడు షాహిబ్ అహ్మద్ (52) ఇరాకీ యుద్ధంలో అమెరికాకు వ్యతిరేకంగా పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడు ముందుగా మెక్సికో వెళ్ళి అక్కడ నుంచి దొంగ పాస్పోర్ట్తో అమెరికాలోకి ఎంటర్ అయ్యాడని గుర్తించారు. అత్యంత నమ్మకమైన సమాచారం మేరకు షాహిబ్ను అరెస్ట్ చేయగలిగామన్నారు.