ఇరాక్​లో బయటపడ్డ 3400 ఏళ్ళ నాటి నగరం

By udayam on June 2nd / 7:38 am IST

వాతావరణ మార్పుల కారణంగా ఓ నది ఎండిపోవడంతో అత్యంత పురాతన పట్టణం ఒకటి బయటకొచ్చింది. ఇరాక్​లోని టైగ్రిస్​ నదిపై కట్టిన మోసుల్​ రిజర్వాయర్​లో నీరు తగ్గిపోవడంతో ఈ 3400 ఏళ్ళ నాటి అత్యంత పురాతన నగరం బయటపడింది. క్రీస్తు పూర్వం 1350 సంవత్సరంలో ఈ నగరం నదిలో మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. అప్పట్లో ఈ నగరం ఇండో–ఇరానియన్​ మిట్టాని రాజుల పరిపాలనలో భాగంగా నిర్మించారని శాస్త్రవేత్తలు తెలిపారు.

ట్యాగ్స్​