రామ భక్తుల కోసం రామాయణ టూర్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీ ట్రిప్ నిర్వహిస్తున్న ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు మరో ఆఫర్ను తీసుకొచ్చింది. ఈ రామాయణ టూర్కు ఉన్న రూ.62,370 ల టికెట్ ధరను నెలవారీ పేమెంట్ (EMI) పద్దతుల్లో చెల్లించవచ్చని భక్తులకు సూచించింది. ఈ యాత్రలో భాగంగా అయోధ్య, జనకపూర్ (నేపాల్), సీతామర్హి, వారణాసి, నాశిక్, రామేశ్వరంల మీదుగా భారత్ గౌరవ్ అనే ప్రత్యేక ట్రైన్లో భక్తులను 18 రోజుల పాటు 8 వేల కి.మీ.ల దూరం తిప్పనుంది.