శుక్రుడి పైకి భారత ఉపగ్రహం

By udayam on May 4th / 12:56 pm IST

మన సౌర కుటుంబంలో సూర్యుడి తర్వాత 2వ గ్రహంగా ఉన్న శుక్ర గ్రహంపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఓ శాటిలైట్​ను పంపడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. అత్యధిక స్థాయిలో ఉష్ణోగత్రలు ఉండే ఈ గ్రహం ఉపరితలం ఎలా ఉంటుందన్న దానిపై పరిశోధనలు జరిపేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్​ సోమ్​నాథ్​ ప్రకటించారు. ఈ ప్రయోగానికి కావాల్సిన ప్రాజెక్ట్​ రిపోర్ట్​ సిద్ధమైందన్న ఆయన నిధుల కొరత కూడా లేదన్నారు. 2024 డిసెంబర్​ నాటికి ఈ మిషన్​ మొదలవుతుందని తెలిపారు.

ట్యాగ్స్​