మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టడానికి ఉరకలేస్తున్న భారత్లో అందులో భాగంగా కీలకమైన రాకెట్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. 2023 నాటికి గగన్యాన్ యాత్ర ద్వారా అంతరిక్షంలోకి భారతీయుల్ని తీసుకెళ్ళడానికి జరిపిన హ్యూమన్ రేటెడ్ సాలిడ్ రాకెట్ స్టాటిక్ టెస్ట్ను ఈరోజు విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. ఈ టెస్ట్లో లాక్ చేయబడ్డ రాకెట్ ఇంజిన్లను ఫైర్ చేసి పరీక్షిస్తారు.