ఇస్రో ప్రయోగాల్లో కీలక టర్న్​: తొలి ప్రైవేట్​ రాకెట్​ ప్రయోగం రేపే

By udayam on November 17th / 5:24 am IST

భారత అంతరిక్ష ప్రయోగాలు శుక్రవాకం కీలక టర్న్​ తీసుకోనున్నాయి. చరిత్రలోనే తొలిసారిగా భారత్​ కు చెందిన తొలి ప్రైవేట్​ రాకెట్​ ను ఇస్రో ఈ శుక్రవారం ప్రయోగించనుంది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ షార్‌ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రయోగించనున్నారు. హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్‌కు విక్రమ్‌-ఎస్‌ అని పేరు పెట్టారు. ఈనెల 12నే ప్రయోగించాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో 18కు వాయిదా వేశారు. ఈ రాకెట్​ లో భారత్​, అమెరికా, సింగపూర్​, ఇండోనేషియా విద్యార్థులు తయారు చేసిన ఫన్ శాట్​, స్పేస్​ కిడ్జ్​ శాటిలైట్లు ఉన్నాయి.

ట్యాగ్స్​