తెలంగాణలో టిఆర్ఎస్ నాయకుల ఇళ్ళపై ఐటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలు, బంధువుల ఇళ్ళల్లో ఏక కాలంలో 50 టీమ్ లు సోదాలు జరుపుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్శిటీ, మల్లారెడ్డి కాలేజీల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కూతురు కొడుకు, అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాలు, కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.