పోలీస్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

By udayam on May 25th / 4:42 am IST

జమ్మూ కశ్మీర్​లో మంగళవారం ఉగ్రవాదులు విధుల్లో ఉన్న పోలీసు అధికారి సైఫుల్లా ఖాదిర్​ను కాల్చి చంపారు. ఈ దాడిలో అతడి కూతురు కూడా గాయపడిందని పోలీసులు తెలిపారు. అయితే ఆమెకు ప్రాణాపాయం తప్పిందని కశ్మీర్​ ఐజి విజయ్​ కుమార్​ వెల్లడించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన ఈ దాడికి పాల్పడ్డవారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. పోలీసు అధికారి మృతిపై జమ్మూ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​