పేటిఎం మాల్​ నుంచి అలిబాబా ఔట్​

By udayam on May 18th / 10:12 am IST

పేటియం సంస్థకు చెందిన ఈకామర్స్​ ప్లాట్​ఫామ్​ పేటిఎం మాల్​లో చైనా కంపెనీ అలీబాబా తన వాటాలను విక్రయించింది. ఈ సంస్థలో అలీబాబాకు దాని అనుబంధ సంస్థ యాంట్​ ఫైనాన్షియల్​కు ఉన్న 43.32 శాతం వాటాను రూ.42 కోట్లకు అమ్మేసినట్లు మింట్​ రిపోర్ట్​ చేసింది. ఈ షేర్లను పేటిఎం ఈ కామర్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కొనుగోలు చేసింది. 2020లో రూ.21 వేల కోట్లుగా ఉన్న పేటిఎం మాల్​ మార్కెట్​ విలువ ప్రస్తుతం రూ.100 కోట్ల కంటే తక్కువకు పడిపోవడంతో జాక్​ మా తన షేర్లను వదిలించుకున్నాడు.

ట్యాగ్స్​