వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన తాను ఎపిలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తామన్న వైసీపీ నాయకుల సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. లక్షల కోట్లను దేశం దాటించగల ఈ నాయకులు జనాలకు మాత్రం మేలు చేయరని వ్యాఖ్యానించారు. ఎపిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ఆయన మరోసారి పేర్కొన్నారు.