కరోనా ఉధృతి మరోసారి పెరుగుతున్న వేళ తూర్పు దేశం జపాన్ లో ఒకరోజు అత్యధిక కొవిడ్ మరణాలు సంభవించాయి. ఆదివారం ఒక్కరోజే ఈ దేశంలో 371 మంది పౌరులు కరోనాతో కన్నుమూశారు. 2020 లో కరోనా మొదలైన తర్వాత జపాన్ లో నమోదైన ఒకరోజు అత్యధిక కరోనా మరణాల సంఖ్య ఇదే. ఈ దేశంలో ఇప్పటి వరకూ 8 కరోనా వేవ్ లు వచ్చాయి. ఇప్పటివరకూ కరోనా కారణంగా ఒకరోజు అత్యధిక మరణాలు జపాన్ లో 347 మాత్రమేనని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అది కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 2 న సంభవించాయి.