ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి కాకినాడ జిల్లాలో పండింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు తన పొలంలో పండిస్తున్న ఈ మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో భలే గిరాకీ ఉంది. కేజీ మామిడి ధర రూ.1 లక్షగా ఉంటుంది. కింగ్ ఆఫ్ మ్యాంగోగా గుర్తింపు ఉన్న ఇది జపాన్లోని మియాజాకీ ప్రాంతంలోనే మూలాలు ఉండడంతో దీనికి మియాజాకీ అంటారు. బయటకు సువాసనలు వెదజల్లుతూ లోపల బంగారం వర్ణంతో మెరిసిపోతూ చూడడానికే వావ్ అనిపించేలా ఉంటుందీ ఫలం.