భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టి20 ఫార్మాట్లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. నిన్న సన్రైజర్స్ జట్టుతో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా అతడు టి20ల్లో 250 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ను బౌల్డ్ చేసిన బుమ్రా ఈ రికార్డును చేరుకున్నాడు. ఈ రికార్డ్కు చేరుకోవడానికి బుమ్రాకు 206 మ్యాచ్లు అవసరమయ్యాయి. అశ్విన్ 274, చాహల్ 271, చావ్లా 270, మిశ్రా 262 లతో ముందున్నారు.