క్యీవ్​ చేరుకున్న జిల్​ బైడెన్​

By udayam on May 9th / 7:28 am IST

రష్యా భీకర దాడితో శవాలదిబ్బగా మారిన ఉక్రెయిన్​లో అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​ ఆకస్మిక పర్యటన జరిపారు. మాతృదినోత్సవం వేళ ఆమె ఉక్రెయిన్​ రాజధాని క్యీవ్​కు చేరుకుని తమ మద్దతు ఈ దేశానికి కొనసాగుతూనే ఉంటుందని చెప్పకనే చెప్పారు. ‘అత్యంత క్రూరంగా సాగుతున్న ఈ యుద్ధం ఈ క్షణమే ఆగిపోవాలని కోరుకుంటున్నా. అమెరికా పౌరులందరి ప్రార్థనలు ఉక్రెయిన్​ వాసులకు అందివ్వడానికే నేనొచ్చింది’ అని జిల్​ బైడెన్​ విలేకరులతో అన్నారు.

ట్యాగ్స్​