క్రికెట్ అభిమానులకు రిలయెన్స్ త్వరలోనే క్రేజీ న్యూస్ చెప్పబోతోంది. ఏడాదికోసారి జరిగే ఐపిఎల్ పండుగను ఈ ఏడాది ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. గత నెలలో జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్ లను కూడా జియో టివి, జియో సినిమా యాప్ లలో ఫ్రీగానే స్ట్రీమింగ్ చేసిన రిలయెన్స్.. ఇప్పుడు ఐపిఎల్ ను కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మొబైల్ నెట్ వర్క్ యూజర్లకూ ఫ్రీగానే స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇవ్వనుందని ది హిందూ బిజినెస్ లైన్ పేర్కొంది.