కశ్మీర్ వేర్పాటు వాద నాయకుడు యాసిన్ మాలిక్కు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆయనపై ఉన్న తీవ్రవాదులకు నిధులు సమకూర్చారనే ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు ఈ సంచలన తీర్పును వెల్లడించింది. మే ఈ నెల 19నే ఆయనను దోషిగా తేల్చిన కోర్టు.. తీర్పును 25వ తేదీకి రిజర్వ్ చేసింది. దేశంలో తిరుగుబాటు లేవనెత్తడం, నేరపూరిత కుట్ర, మిలిటెంట్లకు నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలన్నింటినీ విచారణలో మాలిక్ అంగీకరించాడు.