దాదాపు రెండేళ్ళ పాటు గాయాలతో జట్టుకు దూరమైన ఇంగ్లాండ్ యువ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో ఆర్చర్ కు చోటు దక్కింది. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత నుంచి గాయాలకు గురవుతూ జట్టులోకి ఇలా వచ్చి.. అలా వెళ్తున్న ఈ 27 ఏళ్ళ ససెక్స్ పేసర్ తాజాగా పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. 2021 మార్చిలో అహ్మదాబాద్ లో భారత్ తో జరిగిన టి20 మ్యాచ్ నే అతడు ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్.