రాజస్థాన్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ ఐపిఎల్లో చరిత్ర సృష్టించాడు. ఈ ఒక్క సీజన్లోనే మొత్తం 4 సెంచరీలు చేసిన అతడు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 2016లో కోహ్లీ 4 సెంచరీలు చేయగా ఈ ఏడాది బట్లర్ 4 సెంచరీలతో కోహ్లీని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరుపై 60 బాల్స్లో 106 పరుగులు చేసిన అతడు ఆశ్చర్యకరంగా ఒక సీజన్లో 200లకు పైగా బాల్స్ డాట్ (0) పరుగులు చేసిన ప్లేయర్గానూ నిలిచాడు. మొత్తం 203 బాల్స్ బట్లర్ డాట్ చేశాడు.