షా: కమలనాథుడిగా 2024 వరకూ నడ్డా నే

By udayam on January 18th / 5:27 am IST

బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జయప్రకాష్‌ నడ్డాను 2024 జూన్​ వరకూ కొనసాగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు నడ్డాల నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోగలమనే ధీమా తమకు ఉందని అమిత్​ షా వెల్లడించారు. 2019లో బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నడ్డా 2020లో పూర్తి కాలపు అధ్యక్ష పదవిని చేపట్టారు. మంగళవారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్​