ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీ హోల్సిమ్ ఎజికి చెందిన భారత సబ్సిడరీ కంపెనీలు అంబుజా, ఎసిసి సిమెంట్లను దక్కించుకోవడానికి జెఎస్డబ్ల్యు గ్రూప్, అదానీ గ్రూప్లు రంగంలోకి దిగాయి ఇందుకోసం 4.5 బిలియన్ డాలర్ల ఈక్విటీ షేర్లు, 2.5 బిలియన్ డాలర్ల క్యాష్ను జెఎస్డబ్ల్యూ ఆఫర్ చేసింది. ఈ మొత్తంతో అంబుజా సిమెంట్స్లోని 63 శాతం వాటాను కొనుగోలు చేస్తామని పేర్కొంది. గౌతమ్ అదానీ సైతం అంబుజాను పూర్తిగా దక్కించుకోవడానికి హోల్సిమ్తో చర్చలు జరుపుతున్నారు.