పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్లో ప్రదర్శన తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 18న అతడు ఢిల్లీలోని లైవ్ కన్సర్ట్ నిర్వహించనున్నాడు. జస్టిస్ వరల్డ్ టూర్లో భాగంగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో బీబర్ ప్రదర్శన ఉంటుంది. ఏఈజీ, బుక్ మై షోలు దీనికి కో ప్రమోటర్లుగా ఉండనున్నాయి. ఈ వరల్డ్ టూర్లో భాగంగా జస్టిన్ బీబర్ 30 దేశాల్లో పర్యటించనున్నాడు. ఈ టూర్ 2022 మే నుంచి 2023 మార్చి నెల వరకూ సాగనుంది.