అమిత్​ షాతో కెఎ పాల్​ భేటీ

By udayam on May 13th / 6:18 am IST

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ కేంద్ర హోం మంత్రి అమిత్​ షాను కలిశారు. తెలంగాణలో గత వారం తనపై జరిగిన దాడిని అమిత్​ షాకు వివరించిన ఆయన తనకు జడ్​ ప్లస్​ సెక్యూరిటీని కేటాయించాలని కోరారు. కేసీఆర్​ అవినీతిపైనా విచారణ జరిపించాలని ఆయన అమిత్​ షాకు విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఎపి అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరితే.. తెలంగాణ అప్పు రూ.4.5 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. తనపై జరిగిన దాడిని అమిత్​ షా ఖండించారని చెప్పారు.

ట్యాగ్స్​