సౌత్ ఆఫ్రికా పేస్ సంచలనం కసిగో రబాడ టి20 క్రికెట్లో అరుదైన మైలు రాయికి చేరుకున్నాడు. నిన్న ఐపిఎల్లో బెంగళూరుపై విజృంభించిన ఈ పంజాబ్ పేసర్ 3 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. దీంతో 146 మ్యాచ్ల టి20 కెరీర్లో రబాడ 200ల వికెట్ల మార్క్ను చేరుకున్నాడు. అతడి కంటే ముందు రషీద్ ఖాన్ 134 మ్యాచుల్లోనూ, పాక్ స్పిన్నర్ అజ్మల్ 139 మ్యాచుల్లోనూ ఈ మార్క్ను చేరుకున్నాడు. ఉమర్ గుల్ 147 మ్యాచులు, మలింగ 149 మ్యాచుల్లోనూ 200 వికెట్లు కూల్చారు.