నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే నిజామాబాద్ సెంటర్ లో చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ పేరును అరవింద్ పాడుచేస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేసిన ఆమె.. తాను కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు ఖర్గేతో మాట్లాడానన్న ఆయన ఆరోపణలు అవాస్తవమన్నారు. కాంగ్రెస్ తో కలిసి గెలిచింది నువ్వు.. బురదమీద రాయి వేయకూడదని ఊరుకున్నా.. రాజకీయాలు చెయ్.., పిచ్చి వేషాలు వేయకు అని తీవ్ర పదజాలంతో కవిత ఫైర్ అయ్యారు.
నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు కల్వకుంట్ల కవిత వార్నింగ్
FULL VIDEO – https://t.co/GCiZzuHee5@RaoKavitha @Arvindharmapuri #KalvakuntlaKavitha #ArvindDharmapuri #TRSParty #BJPTelangana #Telangana #Nizamabad #NTVTelugu pic.twitter.com/lUwRHFJu5o
— NTV Telugu (@NtvTeluguLive) November 18, 2022