ఈరోజు విడుదలైన విక్రమ్ సినిమా చివర్లో దీనికి మరో పార్ట్ ఉంటుందని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హింట్ ఇచ్చాడు. దీంతో తర్వాతి చిత్రంలో కమల్తో పాటు సూర్య, కార్తీలు సైతం కీలక పాత్రలు పోషించనున్నట్లు బజ్ వినిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన విక్రమ్ మూవీ సూపర్హిట్ టాక్ సంపాదించింది. ఈ సినిమా చివర్లో సూర్య ఎంట్రీ ఇవ్వడం ఆపై కార్తీ వాయిస్ ఓవర్ రావడంతో విక్రమ్–3 పార్ట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.