ఇంకా విడుదల కూడా కాకుండానే విశ్వనటుడు కమల్ హాసన్ మూవీ విక్రమ్ బాక్సాఫీస్పై దండయాత్ర షురూ చేసేసింది. అడ్వాన్స్ బుకింగ్, శాటిలైట్, ఓటిటి రైట్స్ అమ్మకాల ద్వారా ఈ మూవీకి అప్పుడే రూ.200 కోట్లు వచ్చిపడ్డాయి. జూన్ 3న విడుదల కానున్న ఈ లోకేష్ కనగరాజ్ మూవీలో కమల్తో పాటు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య లు సైతం నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.