నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై పై ఘన విజయంతో ఐపిఎల్ ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకున్న సన్రైజర్స్కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి పయనమయ్యారు. అతడి భార్య సారా రహీం రెండో బిడ్డకు జన్మనిస్తున్నందున అతడు న్యూజిలాండ్కు బయల్దేరాడని సన్రైజర్స్ జట్టు ట్వీట్ చేసింది. దీంతో ఈ ఆదివారం సన్రైజర్స్ పంజాబ్తో ఆడే చివరి లీగ్ మ్యాచ్కు భువనేశ్వర్ కుమార్ లేదా నికోలస్ పూరన్లు కెప్టెన్సీ చేయనున్నారు.