పాన్ వరల్డ్ హిట్ కాంతార ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 24 నుంచి ఈ రిషబ్ శెట్టి ఉగ్ర రూపాన్ని మనం టివిల్లో చూడొచ్చు! అతడే డైరెక్టర్ గా ఉన్న ఈ మూవీ కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లను కొల్లగొట్టింది. ధియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ని ఓటిటిలో ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ రైట్స్ కు భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం.