రిషబ్ షెట్టి హీరోగా, డైరెక్టర్ గా తెరకెక్కించిన రీసెంట్ బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ కాంతార సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. రేపటి నుంచే (నవంబర్ 24) నుంచి ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి ఏకంగా రూ.400 కోట్లను కొల్లగొట్టింది.కర్ణాటక తుళునాడు సంస్కృతి, భూతకోల సంప్రదాయం కళ్లకు కట్టిన ఈ చిత్రానికి హీరో రిషబ్ షెట్టి నే డైరెక్టర్ కూడా.