దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్ 7 కలవరం రేపుతోన్న వేళ … కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు రెవెన్యూ మంత్రి ఆర్.ఆశోక అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభ/త్వం.. బిఎఫ్7 వేరియంట్ సోకిన బాధితుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్లాక్ హాస్పిటల్లో చికిత్స అందించనున్నట్లు తెలిపారు.