గత వారం చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ షియామీకి దేశంలో ఉన్న 725 మిలియన్ డాలర్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీకి కర్ణాటక హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఈ సీజ్ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్ట్ ఈరోజు హోల్డ్లో పెట్టింది. దీంతో ఫారిన్ ఎక్స్ఛేంజ్ చట్టాలను ఉల్లంఘించిన కేసులో షియామీకి కాస్త ఊరట లభించినట్లయింది. భారత్ నుంచి నిధులను చట్ట విరుద్ధంగా 3 విదేశీ కంపెనీలకు షియామీ తరలించిందని ఈడీ తన సోదాల్లో గుర్తించి.. ఆ కంపెనీ ఆస్తులను సీజ్ చేసింది.