కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లు, విద్యా సంస్థలు, బార్లు, రెస్టారెంట్లలో మాస్కులు ధరించిన వారికే అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. కొత్త ఏడాది వేడుకల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. జాగ్రత్త ఉండాలని, ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. కొవిడ్ అదుపులోనే ఉందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.