జమ్మూ కశ్మీర్లో మిలిటెంట్లు మళ్ళీ రెచ్చిపోయారు. బుడ్గాంలో ఉంటున్న టివి ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ (35)ను కాల్చి చంపారు. కాల్పుల్లో గాయపడ్డ ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఈ ఘటనలో ఆమెతోనే ఉన్న ఆమె మేనల్లుడు సైతం గాయపడ్డాడు. ఆమె ఇంట్లోకి చొరబడి మరీ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. లష్కరే–ఈ–తోయిబా సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.