జమ్మూ కశ్మీర్లోని బడ్గామ్ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. తహసీల్ కార్యాలయంలో క్లర్క్గా ఉన్న రాహుల్ భట్ను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. మధ్యాహ్నం అతడి కార్యాలయంలోకి గన్స్తో ప్రవేశించిన ఉగ్రవాదులు అతడిని అక్కడే కాల్చి చంపారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.