రామ్చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ సైతం కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్రలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు రాసిన కథకు సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తన్న ఈ మూవీ రూ.170 కోట్లతో తెరకెక్కుతూ వచ్చే వేసవిలో విడుదల కానుంది.