ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం యునైటెడ్ కింగ్డమ్ రాజు చార్లెస్–3 తో ఫోన్లో మాట్లాడారు.వాతావరణ చర్య, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సహాయం కోసం వినూత్న పరిష్కారాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. పర్యావరణ పరంగా స్థిరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు భారత్ చేస్తున్న మిషన్ లైఫ్ – లైఫ్ సట్ఐల్ ఫర్ ఎన్విరాన్ మెంట్ వివరాలను ప్రధాని బ్రిటన్ రాజుకు వెల్లడించారు.