ఎపిలో టమాటా ధరలు ఎండల కంటే దారుణంగా మండిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో కేజీ టమాటా ఏకంగా రూ.100 మార్క్ను దాటేసింది. ఇక్కడి మదనపల్లె రీజియన్లోని హోల్ సేల్ మార్కెట్లోనే కిలో టమాటా రూ.70–80 పలుకుతుండగా.. బహిరంగ మార్కెట్లో ఆ ధర రూ.100కు చేరుకుంది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ ఇదే రేటు పలుకుతోంది. గత వారం కురిసిన అకాల వర్షాల ధాటికి పంట నష్టం ఏర్పడి దిగుబడి తగ్గిందని.. దీంతో టమాటా రేటు అధికంగా పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.