వరుసగా 5 ఐపిఎల్ సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్గా లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ రికార్డ్ నెలకొల్పాడు. నిన్న రాత్రి కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అతడు 51 బాల్స్లో 68 పరుగులు చేసి ఈ మార్క్ను చేరుకున్నాడు. డేవిడ్ వార్నర్ వరుసగా 6 సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. 5 సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసిన (వరుస సీజన్లు కాదు) భారత క్రికెటర్లలో కోహ్లీ, దావన్లు ఉన్నారు.