ఐపిఎల్ గ్రూప్ మ్యాచులకు కేవలం 50 శాతం మంది అభిమానులనే అనుమతిస్తున్న బిసిసిఐ.. ఇప్పుడు గుడ్న్యూస్ మోసుకొచ్చింది. ప్లే ఆఫ్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచులకు అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానాల్లో 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని ప్రకటించింది. మే 24, 25 తేదీల్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లు ఈడెన్లో జరగనుండా.. 27న క్వాలిఫైయర్ 2, 29న ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు.