పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ యువతి హర్షిత సత్తా చాటింది. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. ఈమెకు పీజీ నీట్ ఫలితాల్లో 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదవిన హర్షిత.. విశాఖలో బైపీసీ పూర్తి చేసింది. ఎంసెట్లో 180వ ర్యాంకు సాధించిన హర్షిత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసింది.