బంగ్లాదేశ్తో జరుగుతున్న 2వ టెస్ట్ తొలిరోజు ఆటలో శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్కు మైదానంలోనే గుండెపోటు వచ్చింది. తొలిరోజు ఆట లంచ్ సమయానికి ముందు అతడు ఛాతీ నొప్పితో బాధపడుతూ మైదానంలో కూర్చుండిపోయాడు. దీంతో టీం మెడికల్ సిబ్బంది అతడికి వెంటనే పరీక్షలు జరిపి ఢాకాలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడి తీవ్రమైన ఎండల ధాటికి డీహైడ్రేషన్ అవ్వడంతోనే మెండిస్ కు ఛాతీనొప్పి వచ్చినట్లు శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.