హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ కు కోర్టు 10 ఏళ్ళ కఠిన కారాగార శిక్షను విధించింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా ఇదే శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను కూడా విధించింది. కేంద్ర మాజీ మంత్రి పిఎం.సయీద్ కు ఫైజల్ వరుసకు అల్లుడవుతాడు. ఈ కేసులో శిక్ష పడ్డ మిగతా ముగ్గురు కూడా వరుసకు బంధువులే. మహ్మద్ సలీ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న కేసు లో ముద్దాయిల నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించారు.