శ్రీలంక మాజీ కెప్టెన్, మాజీ పేస్ బౌలర్ లసిత్ మలింగ ఆ దేశ క్రికెట్కు బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా ఎంపికయ్యాడు. జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్బాల్ సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డ్ మలింగను ఈ పదవికి ఎంపిక చేసింది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్లూ 3 టి20లు, 5 వన్డేలు ఆడనున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో పర్యటించిన శ్రీలంక జట్టుకు సైతం మలింగ.. బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా పనిచేశాడు.