ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రఫేల్ యూనిట్ల డెలివరీ పూర్తయింది. ఈ ప్యాకేజీలో చివరి రఫేల్ యుద్ధ విమానం కూడా గురువారం భారత్ కు చేరుకుంది. 4.5 తరానికి చెందిన మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం భారత ప్రభుత్వం రూ.60 వేల కోట్లతో 2016లో ఒప్పందం చేసుకోగా.. ఆ డీల్ 2022 డిసెంబర్ నాటికి పూర్తయింది. ఇప్పటికే 35 యుద్ధ విమానాలను దేశంలోని అంబాలా, హర్యానా, హషిమారా ఎయిర్ బేస్ లకు తరలించగా.. చివరి దానిని ఎక్కడ ప్లేస్ చేస్తారన్నది తేలాల్సి ఉంది.