కోర్టు ఆవరణలోనే పిటిషనర్​పై న్యాయవాది దాడి

By udayam on May 7th / 6:51 am IST

మధ్యప్రదేశ్​లోని షాదోల్​ జిల్లా కోర్టులో ఓ న్యాయవాది లేడీ పిటిషనర్​ను కోర్టు ఆవరణలోనే కొట్టిన వీడియో వైరల్​ అవుతోంది. పిటిషనర్​ భారతి పటేల్​ (28) అతడి బారి నుంచి తప్పించుకుని పారిపోతున్నా.. 58 ఏళ్ళ న్యాయవాది భగవాన్​ సింగ్​ ఆమె వెంట పడి మరీ చితకబాదాడు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే నిలబడి గుడ్లప్పగించి చూసిన ప్రజలు అతడిని కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. తన భర్తతో ఏర్పడ్డ వివాదానికి న్యాయం కావాలంటూ ఆ యువతి కోర్టుకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్​