విడాకులు అడిగిందని లెక్చరర్​ గొంతు కోసిన భర్త

By udayam on November 18th / 4:44 am IST

అనంతపురం ఆర్ట్స్​ కాలేజీలో పట్టపగలు స్టూడెంట్స్​ చూస్తుండగానే ఓ లెక్చరర్​ ను ఆమె భర్త గొంతుకోశాడు. చాలాకాలంగా విడివిడిగా ఉంటున్న వీరిద్దరి మధ్య విడాకుల కేసు నడుస్తోంది. బుధవారం ఉదయం ఎప్పట్లానే కాలేజీకి వచ్చిన లెక్చరర్​ సుమంగళి కోసం అక్కడే కాపు కాసిన భర్త పరేష్​ క్షణాల వ్యవధిలోనే తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడికి దిగాడు.దీంతో ఆమె గొంతు కోసుకుని రక్తం కారింది. ఆమె అరుపులు విన్న స్టూడెంట్స్​, లెక్చరర్స్​ పరేష్​ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన భర్తపై ఆమె పెట్టిన గృహ హింస కేసు ను వెనక్కి తీసుకోనందుకే అతడు ఈ దాడికి పాల్పడ్డట్టు భావిస్తున్నారు.

ట్యాగ్స్​