రేపటి నుంచి ఐపివోకు రానున్న ఎల్ఐసి.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా ఆర్జించింది. 5,92,96,853 కోట్ల ఈక్విటీ షేర్స్ను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన ఎల్ఐసి ఒక్కో షేరును రూ.949 చొప్పున అమ్మేసింది. వీటిలో 4.2 కోట్ల షేర్లు అంటే 71.12 శాతం ఈక్విటీ షేర్స్ను 15 దేశీయ ఇన్స్యూరెన్స్ కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కొనుగోలు చేశాయి. వీటిలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఎస్బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఉన్నాయి.